'తెలంగాణ రైజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌

రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ని కోరారు.

By అంజి  Published on  14 March 2025 8:15 AM IST
CM Revanth, Union Minister Jaishankar, Telangana rise

'తెలంగాణ రైజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌

రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ ఏడాది హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాలైన మిస్ వ‌ర‌ల్డ్‌ పోటీలు, గ్లోబ‌ల్ డీప్ టెక్ స‌ద‌స్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు, యానిమేష‌న్ గేమింగ్‌, వీఎఫ్ఎక్స్‌తో పాటు వినోద ప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ బ‌లాన్ని చాటే ఇండియా జాయ్ వంటి వేదికల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దౌత్య సహకారంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్‌ విజయవంతం అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో నిర్వహించే భారత కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్‌కు తగినంత ప్రచారం, ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి అభ్యర్థన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న హైద‌రాబాద్‌ నగరంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు విదేశీ వ్యవహారాల శాఖ మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు.

Next Story