తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
569 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,05,201 శాంపిళ్లను
By Medi Samrat Published on
7 Aug 2021 2:18 PM GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,05,201 శాంపిళ్లను పరీక్షించగా.. 569 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,823కి పెరిగింది. నిన్న 657 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,36,552కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.008 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు నమోదైనట్లు తెలిపింది.
Next Story