తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,009 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కు చేరింది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 705 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 14 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా మృతి చెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. ఇక నిన్న 1,878 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి.