ఆర్టీసీలో మొట్ట‌మొద‌టి సారిగా ఏసీ బస్సులు ప్రవేశపెట్టిన రోజు తెలుసా..!

40 Years for the Introduction of AC Buses. ఆర్టీసీలో ఈరోజు సరిగ్గా 40 సంవత్సరాల కిందట ఏసీ బస్సులను ప్రవేశ పెట్టారట..!

By Medi Samrat
Published on : 1 Jun 2022 4:28 PM IST

ఆర్టీసీలో మొట్ట‌మొద‌టి సారిగా ఏసీ బస్సులు ప్రవేశపెట్టిన రోజు తెలుసా..!

ఆర్టీసీలో ఈరోజు సరిగ్గా 40 సంవత్సరాల కిందట ఏసీ బస్సులను ప్రవేశ పెట్టారట..! ఇప్పుడంటే ఎన్నో ఏసీ బస్సులను మనం చూస్తూ వస్తున్నాం. కానీ అప్పట్లో ఏసీ బస్సు అత్యంత అరుదు కదా..! అందుకే ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఏపీఎస్ ఆర్టీసీ అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ఈ ఏసీ బస్సు ప్రయాణం ఉండేది. 01-06-1982న అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభాగం సగర్వంగా ఏసీ బస్సును ప్రజల కోసం తీసుకుని వచ్చింది. ఈ ఏసీ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు నడుస్తుంది. అప్పట్లో టికెట్ ధర 65 రూపాయలు మాత్రమేనట.. కేవలం సూర్యాపేటలో మాత్రమే ఆపుతూ ఉండేవారు. అప్పటి ప్రకటనను తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెటిజన్లతో పంచుకున్నారు.

'చరిత్రలో ఈ రోజు ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా AC బస్సులు ప్రవేశపెట్టిన రోజు 01-Jun-1982

Completed Ruby Jubilee of 40 Years for the Introduction of AC Buses in erstwhile #APSRTC Now #TSRTC" అంటూ సజ్జనార్ అప్పటి ప్రకటనను షేర్ చేశారు.











Next Story