తెలంగాణ కరోనా బులిటెన్.. తగ్గిన కేసులు, మరణాలు
3837 New Corona Cases reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,070 శాంపిళ్లను పరీక్షించగా.. 3,837 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
By Medi Samrat Published on
19 May 2021 1:49 PM GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,070 శాంపిళ్లను పరీక్షించగా.. 3,837 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,40,603కి చేరింది. నిన్న ఒక్క రోజే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3037కి పెరిగింది.
నిన్న 4,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,90,620కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.
Next Story