Hanamkonda: వాటర్‌ ట్యాంక్‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  28 Oct 2024 3:15 AM GMT
water tank,  Hanmakonda district, Ratnagiri

Hanamkonda: వాటర్‌ ట్యాంక్‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న నీటి ట్యాంక్‌లో పడి మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. దివ్య వివరాలు వెల్లడించారు. బాలిక తన ఇంటి ముంగిట్లో మరో పిల్లవాడితో ఆడుకుంటోందని, అయితే ఆమె తల్లిదండ్రులు బయట పనుల్లో ఉన్నారని తెలిపారు.

వాటర్ ట్యాంక్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు చిన్నారి అందులో పడిపోయింది. మరో యువతి బాలిక తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వారికి తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. అయితే వారు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, ఆమె మార్గం మధ్యలోనే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రత్నగిరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story