Telangana: ఆటోలో 23 మందిని ఎక్కించాడు.. వీడియో

ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను కూర్చోపెట్టడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు.

By -  అంజి
Published on : 19 Nov 2025 11:47 AM IST

23 children in one auto,  Police seize auto, school children , Nagar Kurnool

Telangana: ఆటోలో 23 మందిని ఎక్కించాడు.. వీడియో

ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను కూర్చోపెట్టడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. తాజాగా రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌లో ఆటోలో 23 మంది చిన్నారులను కూర్చోబెట్టి స్కూల్‌కు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటోను ట్రాఫిక్‌ ఎస్సై కల్యాణ్‌ సీజ్‌ చేశారు. ఆ తర్వాత చిన్నారులను మరో రెండు వాహనాలలో ఇంటికి పంపించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. అలాగే చిన్న పొరపాటు జరిగినా పిల్లల ప్రాణాలకు ప్రమాదమేనని తల్లిదండ్రులకు సూచించారు.

Next Story