కోహ్లీకి హోరెత్తుతున్న బర్త్డే విషేస్.. ఇంతకీ ఎక్కడున్నాడంటే..!
By Medi Samrat Published on 5 Nov 2019 7:40 AM GMTముఖ్యాంశాలు
- 31వ వడిలోకి అడుగిడుతున్న కోహ్లీ
- భూటాన్ విహారయాత్రలో విరుష్క దంపతులు
- ఐసీసీ ప్రత్యేక విషేస్
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 31వ వడిలోకి ప్రవేశించాడు. బంగ్లాతో సిరీస్ కు ధూరంగా ఉన్న కోహ్లీ.. ఈ రోజును ఎంజాయ్ చేయడానికి భార్య అనుష్క శర్మతో కలిసి విహారయాత్ర వెళ్లాడు. భూటాన్లో అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి ఫొటోలను అనుష్క ఇన్స్టాలో షేర్ చేసింది. కోహ్లీ, అనుష్కలు భూటాన్లో విహరిస్తున్న పోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని అనుష్క తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పేర్కొంది. గత సంవత్సరం బర్త్డే రోజున విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్లో గడిపగా.. ఈ సారి భూటాన్ లో విహరిస్తున్నారు. కోహ్లీ బర్త్డే సందర్భంగా... 'కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు' అని అనుష్క ట్వీట్ చేసింది.
కోహ్లీ పుట్టినరోజు సంధర్భంగా స్టార్స్పోర్ట్స్ సూపర్ 'వి' పేరిట రూపొందించిన సిరీస్లో తొలి ఎపిసోడ్ను మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు ప్రసారం చేయనుంది. 15 ఏళ్ల ప్రాయంలో క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ అయ్యే వరకు కోహ్లీ ప్రస్థానాన్ని ఈ ఎపిసోడ్లలో చూపించనున్నారు. కోహ్లీ చిన్నతనంలో తన కుటుంబం, స్నేహితులు, గురువులతో సంబంధాలను కళ్లకు కట్టినట్టు చూపేందుకు సిద్దమైంది. కోహ్లీ ఎదుర్కొన్న కష్టనష్టాలు, సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లలో వివరిస్తారట.
కోహ్లీ బర్త్ డే సంధర్బంగా సూపర్ 'వి'లో మొదటి ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ అవనుంది. మిగిలిన 11 ఎపిసోడ్లు తదుపరి ఆదివారాలు ఉదయం 9గంటలకు ప్రసారమవనుంది. ఇదిలావుంటే.. తీరికలేని క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతనికి విశ్రాంతి కల్పించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. అయితే.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఈ నెల 14 నుండి బంగ్లాతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు కోహ్లీ మళ్లీ జట్టుతో కలుస్తాడు.
విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ కోహ్లీకి తన ట్విట్టర్లో ఖాతాలో శుభాకాంక్షలు తెలిపింది. ఐసీసీ చేసిన ట్వీట్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసిన క్రికెటర్... టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక డబుల్ సెంచరీలు... ఐసీసీ అవార్డులను క్లీన్ స్వీప్ చేశావంటూ ట్వీట్లో పేర్కొంది.