తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Sep 2019 6:45 AM GMT�
తమిళనాడు. శ్రీలంక బాంబ్ పేలుళ్లు, ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేశాయని ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. తమిళనాడులోని కృష్ణగిరి కొండను ఎన్ఐఏ, పోలీసులు జల్లెడ పట్టారు. పది గంటలపాటు సోదాలు జరిగినట్లు సమాచారం. కొండపై పేలుడు పదార్ధాలు దాచినట్లు ఉగ్రవాది రెహ్మన్ విచారణలో వెల్లడించారు. దీంతో రెహ్మన్ను తీసుకెళ్లి పోలీసులు సోదాలు చేశారు. అయితే..కొండపై పేలుడు పదార్థాలు లభించలేదు.
�
Next Story