టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'నిన్నే పెళ్లాడతా'..
By న్యూస్మీటర్ తెలుగుPublished on : 31 Oct 2019 2:56 PM IST

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధిక హీరో హీరోయిన్లుగా వైకుంఠ బోను దర్శకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం. రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Next Story