'సైరా'అంటోన్న నరసింహరెడ్డి ట్రైలర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 12:51 PM GMT
సైరాఅంటోన్న నరసింహరెడ్డి ట్రైలర్‌

బాహుబలి తరువాత టాలీవుడ్‌లో అంతటి సినిమా సైరా నరసింహరెడ్డి అంటున్నారు సినీ క్రిటిక్స్. వారు అంటున్నట్లే తాజాగా విడుదలైన సైరా నరసింహరెడ్డి ట్రైలర్ చిరు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌ ఒక్కసారి సినిమా అంచనాలను పెంచిందనే చెప్పాలి. చారిత్రక , భారీ చిత్రం విజయం సాధిస్తుందంటున్నారు మెగాస్టార్ అభిమానులు.

1857 కంటే ముందే తెలుగు గడ్డ మీద ఓ వీరుడి నేతృత్వంలో స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది. అదే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి తెల్ల దొరలపై సాగించిన సమరం. సైరా నరసింహరెడ్డి సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గాంధీ జయంతి అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైరా నరసింహరెడ్డి టీజర్ మెగా అభిమానుల్లో వేడి పెంచింది.

ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమాను చిరు కుటుంబం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధమవుతుంది. ట్రైలర్‌లో ఆనాటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. " నరసింహరెడ్డి సామాన్యుడు కాదు..కారణజన్ముడంటూ ట్రైలర్ మొదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ భూమ్మీద పుట్టింది మేము..ఈ మట్టిలో కలిసేది మేము..మీకెందుకు కట్టాలి శిస్తు అంటూ చిరు పలికే మాటలు థియేటర్లలో ఈలలు మోగించడం ఖాయం.

సైరా నరసింహరెడ్డి మూవీలో హీరోయిన్ నయనతార..ఇంకా అమితాబ్ బచ్చన్, సుదీప్ , జగపతిబాబు, తమన్నాలు నటిస్తున్నారు.

Next Story