పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

By Newsmeter.Network  Published on  3 Dec 2019 4:22 PM GMT
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది విద్యాశాఖ. 2020 మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ పరక్షలు ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక నిర్వహిస్తామని వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌ ఇలా...

మార్చి 23 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

మార్చి 24 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

మార్చి 26 - సెంకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 27 - ఇంగ్లీష్‌ పేపర్‌ 1

మార్చి 28 - ఇంగ్లీష్‌ పేపర్‌ 2

మార్చి 30 - గణితం పేపర్‌ 1

మార్చి 31 - గణితం పేపర్‌ 2

ఏప్రిల్‌ 01 - సైన్స్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 03 - జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 04 - సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 06 - సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 07 - శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

ఏప్రిల్‌ 8 - ఒకేషనల్‌ పరీక్షలు

Next Story