ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసేది అప్పుడేనా..!

Bangalore set to announce new captain on THIS date. పది ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 2022 సీజన్‌కు ముందు కెప్టెన్‌ని ఖరారు చేయలేదు

By M.S.R  Published on  8 March 2022 7:42 AM GMT
ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసేది అప్పుడేనా..!

పది ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 2022 సీజన్‌కు ముందు కెప్టెన్‌ని ఖరారు చేయలేదు. ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడడంతో మొదలు కాబోతోంది.

ఆర్సీబీ తన మొదటి మ్యాచ్‌ని మార్చి 27న మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. అయితే ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ని ఎప్పుడు ప్రకటిస్తారనేది ప్రతి అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు ఆర్సీబీ బృందం ఐపీఎల్‌ 2022కి కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌ని నియమించడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆర్‌సీబీ మార్చి 12న సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశానికి పిలుపునిచ్చింది. ఐపీఎల్ 2021 తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.

ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ నే మొదట కెప్టెన్ గా చేస్తారని భావించినా.. ఆ తర్వాత జట్టు యాజమాన్యం డు ప్లెసిస్‌ ను కెప్టెన్ గా నియమించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా ప్రారంభించబడిన ఆర్‌సీబీ బార్ అండ్‌ కేఫ్‌లో 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రకటన జరుగుతుందని భావిస్తున్నారు. అదే తేదీన ఆర్‌సీబీ తమ కొత్త జెర్సీని కూడా లాంచ్ చేస్తుంది. ఐపీఎల్‌ 2022లో మొదటి మూడు మ్యాచ్‌లకు మాక్స్‌వెల్ అందుబాటులో లేకపోవడంతో అతనికి కెప్టెన్సీ అవకాశాలు ఇవ్వడంపై ప్రతికూలంగా మారింది. ఫాఫ్ డు ప్లెసిస్ కు ప్రపంచ కప్‌తో సహా మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టును నడిపించిన అపారమైన అనుభవం ఉంది. అందుకే డు ప్లెసిస్ కే కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయని అంటూ ఉన్నారు.

Next Story