ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన సిద్ధి వినాయక బజాజ్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చేతక్ C25 ను సైనిక్పురి చేతక్ సిఇసి షోరూమ్, ఎ.ఎస్.రావు నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో, వాయుపురి సైనిక్పురి, సికింద్రాబాద్ మరియు కుషాయిగూడ లోని నాగారం చేతక్ సిఇసి షోరూమ్, నాగార్జున నగర్ కాలనీ, కుషాయిగూడ, సికింద్రాబాద్ వద్ద అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్య అతిథిగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైనిక్ పురి పోలీస్ స్టేషన్ - పి. సందీప్ కమెర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ .ఆర్ .సతీష్ కుమార్, పి.కమలా పరమనాధం, జె. అర్జున రెడ్డితో పాటుగా ఏరియా సేల్స్ మేనేజర్ ప్రవీణ్ పరదేశి, చేతక్ డివిజన్ నుండి ఏరియా సర్వీస్ మేనేజర్, ఎన్ రఘువంశిధర్ రెడ్డి, సిద్ధి వినాయక గ్రూప్ చైర్మన్ కె వి బాబుల్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక ముందడుగును చేతక్ C25 సూచిస్తుంది, పట్టణ ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించడానికి అత్యాధునిక సాంకేతికతతో బలమైన డిజైన్ను మిళితం చేస్తుంది. దృఢమైన మెటల్ బాడీ , ఐడిసి 113 కిమీ (ఏఆర్ఏఐ-సర్టిఫైడ్) కలిగి ఉన్న ఈ మోడల్ నేటి రైడర్ల విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది.
"మా ప్రియమైన కస్టమర్లకు చేతక్ C25ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము" అని సిద్ధి వినాయక గ్రూప్ చైర్మన్ కె వి బాబుల్ రెడ్డి అన్నారు. మా కస్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆవిష్కరణలను అందించడం, స్థిరత్వాన్ని పెంపొందించడం అనే మా నిబద్ధతకు ఈ ఆవిష్కరణ నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.
చేతక్ C25 రూ. 87,100 (తెలంగాణ, ఎక్స్-షోరూమ్) ధరకే లభిస్తుంది. ఇప్పుడు చేతక్ C25 సిద్ధి వినాయక బజాజ్ యొక్క సైనిక్ పురి, నాగారం షోరూమ్లతో పాటుగా బేగంపేట, కాచిగూడ, కూకట్పల్లి, ఎల్ బి నగర్, సైనిక్ పురి, నాగారం, సిద్దిపేట మరియు మెదక్లోని ఇతర షోరూమ్లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.