రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని డానోన్ ఇండియా ప్రతిజ్ఞ

ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ఒక మైలురాయిని నెలకొల్పింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 March 2026 5:29 PM IST

రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని డానోన్ ఇండియా ప్రతిజ్ఞ

ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.

నవంబర్ 2025లో, డనోన్ ఇండియా దేశవ్యాప్తంగా ఐరన్ లోప రక్తహీనత (IDA)ను గుర్తించడం, నివారించడాన్ని వేగవంతం చేయడానికి 'ఐరన్ అప్!' అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, అవగాహన పెంచడానికి, సకాలంలో రోగ నిర్ధారణను మెరుగుపరచడానికి, నివారణ పోషణను ప్రోత్సహించడాని కి కట్టుబడి ఉండాలని భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పిలుపునిస్తూ డనోన్ 'IDA ప్లెడ్జ్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. కుటుంబాలు ప్రతిరోజూ ఐరన్ లోపాన్ని అర్థం చేసుకుని, దానిపై చర్యలు తీసు కోవడంలో సహాయపడటానికి వైద్య సమాజంలో ఒక బలమైన, ఏకీకృత ఉద్యమాన్ని నిర్మించడమే ఈ సామూ హిక ప్రయత్న లక్ష్యం.

'ఐరన్ అప్' చొరవ అనే ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న శిశువైద్యులు, సాధారణ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను భాగస్వాములను చేసింది. వైద్య సమాజాన్ని సమీకరించడం ద్వారా, డానోన్ ఇండియా ముఖ్యంగా పేద ప్రజలలో ఐరన్ లోపంపై అవగాహన పెంచడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన విజ్ఞాన-ఆధారిత పోషకాహార విధానంలో భాగంగా, డానోన్ ఇండియా ఐరన్ శోషణకు, పేగు ఆరో గ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలతో రూపొందించిన 'ఐరన్‌బయోటిక్స్' వంటి పరిష్కారాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. తద్వారా, ఐరన్ లోపం, రక్తహీనతను పెద్ద ఎత్తున పరిష్కరించాలనే తన నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది.

ఈ మైలురాయి గురించి డనోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రభావ వంతమైన కార్యక్రమానికి గాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం మాకు గర్వకారణం. లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న రక్తహీనతపై పోరాడటానికి వైద్య సమాజంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి 20,911 ప్రతిజ్ఞలను పొందడం ద్వారా ప్రదర్శించవచ్చు. ఈ నిరంతర, సమాజ-ఆధారిత విధానం లెక్కలేనంత మంది భారతీయుల ఆరోగ్య ఫలితాలను మార్చివేస్తుంది. ఇది అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సమాజాలు, సంస్థలు ఏకతాటిపైకి వచ్చే సామూ హిక చర్య శక్తిని ప్రతిబింబిస్తుంది. దేశ పోషకాహార పునాదిని బలోపేతం చేయడమే కాకుండా, సాక్ష్యాధారిత, సమ్మిళిత ప్రజారోగ్య ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టే ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం’’ అని అన్నారు.

ఐరన్‌అప్ కార్యక్రమంతో పాటు, డనోన్ ఇండియా బిహార్‌లో 'స్వస్థ మాత స్వస్థ బాలక్' అనే ఏడాది పొడవునా సాగే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. గర్భిణీ స్త్రీల పోషణను మెరుగుపరచడం, అవగాహనను పెంచడం, తల్లులు, వారి శిశువులిద్దరికీ మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. గర్భిణులు, శిశువులలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి డనోన్ చేస్తున్న ప్రత్యేక ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగం.

పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల కొరతను పరిష్కరించడానికి డనోన్ ఇండియా చేస్తున్న నిరంతర ప్రయత్నా లలో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఆరోగ్యకరమైన భవి ష్యత్తును నిర్మించడానికి ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు, విధాన రూపకర్తలు, సమాజాలతో కలిసి పని చేయడా నికి ఈ సంస్థ కట్టుబడి ఉంది.

Next Story