ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలో బొలంత్ర పరిధిలోని మంద్రాజ్పూర్ దారిలో బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సుపై 11కెవి విద్యుత్ లైన్ తీగలు తెగిపడి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.