డెలీవరి బాయ్ అవతారమెత్తిన షామీ ఎండీ మను కుమార్..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 3:49 PM GMT
డెలీవరి బాయ్ అవతారమెత్తిన షామీ ఎండీ మను కుమార్..!!

న్యూఢిల్లీ: షామీ ఇండియా కంపెనీ ఎండీ డెలివరి బాయ్ అవతార మెత్తాడు. యుగంధర్ రెడ్డి అనే షామీ సంస్థ అభిమానికి ఎండీ మనుకుమార్‌ జైన్ స్వయంగా ఫోన్ డెలివరి చేశాడు. ఫీడ్ బ్యాక్‌ తీసుకోవడానికే ఇలా చేశానని ఆయన చెప్పారు. కొత్త ఫోన్లను విడుదల చేసిన ప్రతిసారి ఇలా చేస్తానన్నారు.

ఢిల్లీలో నివాసముండే యుగంధర్ రెడ్డి రెడ్‌మీ నోట్ 8ప్రో ఫోన్‌ ఆర్డర్‌ చేశాడు.ఆయన కుటుంబం రెడ్ మీ అభిమానుల కుటుంబం.చాలా ఎంఐ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.

షామీ తన మార్కెట్‌ను విస్తృత మర్చుకుంటుంది. 2020 లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. 10వేల స్టోర్లు లక్ష్యంగా ఎండీ మను కుమార్‌ జైన్ ముందుకు వెళ్తున్నారు.



Next Story