సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

By సుభాష్  Published on  7 May 2020 10:59 AM GMT
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం దాయారా పంచాయతీ పరిధిలోని గండిగూడ పారిశ్రామికవాడలో స్ర్కాప్‌ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, బుధవారం ఢిల్లీలోని త్రిక్రీ బోర్డర్‌ ఏరియాలో ఓ గోదాంలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించింది.

[video width="640" height="480" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-07-at-3.26.11-PM.mp4"][/video]

Next Story