28 రోజుల్లోనే శబరిమల ఆదాయం ఎంతో తెలుసా..?
By సుభాష్ Published on 16 Dec 2019 3:55 PM GMTశమరిమల అయ్యప్ప స్వామి ఆదాయం రూ.100కోట్లు దాటేసింది. అయ్యప్పమలాధారణలు మొదలైన నాటి నుంచి ఒక రెండు నెలల్లోనే ఈ ఆలయానికి భారీ మొత్తంలో సమకూరుతుంది. ఆలయం తెరిచిన 28 రోజులకే ఈ ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. గత ఏడాది ఈ సమయానికి రూ.64 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని తెలిపింది. కాగా, మండలం-మకర విలక్కు యాత్రకుగానూ నవంబర్ 17న అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం నాటికి రూ.104.72 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ దేవస్థానం వివరించింది. అన్నదానం, ప్రసాదాల విక్రయం, హుండీల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆదాయం భారీగా పెరిగిందని, అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశం చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story