'ఎన్టీఆర్ - చరణ్' మధ్య గొడవ జరిగినా..!

By Newsmeter.Network  Published on  9 Dec 2019 10:46 AM GMT
ఎన్టీఆర్ - చరణ్ మధ్య గొడవ జరిగినా..!

ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో తారక్ - చరణ్ మొదటి సారి కలుసుకునే సీన్స్ ను రాజమౌళి ప్రస్తుతం షూట్ చేస్తున్నాడు. కాగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించే సమయంలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలోని రామ్ చరణ్ అక్కడకి వస్తాడట. మొదట్లో ఇద్దరికీ మధ్య చిన్నపాటి గొడవ జరిగినా.. భీం ఆవేశాన్ని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడట. ఓవరాల్ గా సినిమాలోనే ఈ సీక్వెన్స్ హైలైట్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. 'బాహుబలి' సిరీస్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ కు జోడిగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా విదేశీ భామ 'ఒలివియా మోరిస్' షూట్ లో కూడా పాల్గొంటుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొత్త కాలం ఎదురుచూడక తప్పదు. కాగా ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Next Story