ఘోర రోడ్డు ప్రమాదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 9:14 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం

  • జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • స్పాట్ లోనే ముగ్గురు మృతి

జనగామ: దేవరుప్పుల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న డీసీఎం వ్యాను, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్‌, సుకన్య ,మహమ్మద్‌ నజీర్‌గా గుర్తించారు.నజీర్ కార్‌ డ్రైవర్ . మంజుల, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story