అనంతలో ఘోర రోడ్డుప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2020 11:39 AM GMT
అనంతలో ఘోర రోడ్డుప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెలుతున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

గార్లదిన్నె మండలం రామదాసుపేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై వెలుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. మృతులను గుత్తికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story