ఉగ్రవాది ఒసామాను హతమార్చిన భద్రతాబలగాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Sep 2019 2:50 PM GMTజమ్ముకశ్మీర్: రాంబన్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది.
సరిహద్దులు దాటి కశ్మీర్లోయలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి.
ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతాబలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా కూడా ఉన్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి.
ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఓ జవాన్ అమరుడయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
Next Story