ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. దసరాకు 78 రోజుల బోనస్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 11లక్షలకు పైగా ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు భారీగా బోనస్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.