ఆ ప్రైవేట్ స్కూల్ 'పిచ్చి' ప‌రాకాష్ట‌కు చేరింది.. న‌ర్స‌రీ ర్యాంకులేంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 6:43 AM GMT
ఆ ప్రైవేట్ స్కూల్ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది.. న‌ర్స‌రీ ర్యాంకులేంటి..?

సాధార‌ణంగా స్కూళ్ల‌ల్లో 7, 8, 9, 10 క్లాస్ విద్యార్థులు ర్యాంకుల కోసం పోటీపడటం చూస్తాం. కానీ హైదరాబాద్‌లో.. ప్రియా భారతి హైస్కూల్‌లో నర్సరీ టాపర్స్ జాబితాలో 10 మంది విద్యార్థులు.. ఎల్‌కేజీ టాపర్ జాబితాలో 14 మంది విద్యార్థులు.. యూకేజీ టాపర్స్ జాబితాలో 11మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే.. ప‌స్టు క్లాస్‌లో 9 మంది విద్యార్థులు క్లాస్ ప‌స్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యార‌ట‌.

అయితే.. ఆ స్కూల్ యాజ‌మాన్యం ఏకంగా ఆ చిన్నారుల ఫోటోలు , వారి గ్రేడ్‌ల‌తో స‌హ బిల్‌బోర్డ్‌ను పెట్టి నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని విద్యార్థులుగా భావించరనే విజ్ఞత కూడా లేదంటూ నెటిజన్లు సదరు పాఠశాల యాజమాన్యం మీద మండిప‌డుతున్నారు.



Next Story