క్రికెట్కు ప్రజ్ఞాన్ ఓజా వీడ్కోలు..
By Newsmeter.Network Published on 21 Feb 2020 7:09 AM GMTలెఫ్ట్ఆర్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన ట్వీట్టర్ అకౌంట్లో క్రికెట్కు గుడ్ బై చెప్పే విషయాన్ని స్పష్టం చేశాడు.
టీమిండియా తరుపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు, వన్డేల్లో 21 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 10 వికెట్లను సాధించాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. 2014లో ఓజా బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు తలెత్తాయి. అయితే.. 2015లో క్లియరెన్స్ లభించింది. 2018లో బిహార్ తరఫున తన చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్నాడు.
‘నేను తీసుకున్న వీడ్కోలు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగే సమయం ఇదేనని భావిస్తున్నానని పేర్కొన్నాడు. భారత క్రికెటర్గా ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన అత్యంత గౌరవమన్నాడు. భారత్ క్రికెట్ జట్టుకు ఆడాలని చిన్నప్పట్నుంచి కలలు కనేవాడినని, అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు'.
�