KCR సారూ.. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా?

YS Sharmila fires on CM KCR.తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వైఎస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 11:16 AM GMT
KCR సారూ.. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా?

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వైఎస్ ష‌ర్మిల సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. అయితే.. ష‌ర్మిల ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం వాటిపై స్పందిచ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి ష‌ర్మిల ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యింది. వ్యాక్సిన్ల పై ఆదివారం మ‌రోసారి ట్వీట్ చేసింది. ప్ర‌భుత్వానికి దొర‌క‌ని వ్యాక్సిన్లు ప్రైవేటుకు ఎలా దొరుకుతున్నాయ్ అంటూ మండిప‌డింది. ప్ర‌జ‌ల ప్రాణాలు అంటే మీకు విలువ లేక‌నా..? క‌మీష‌న్ల‌కు ఆశ‌ప‌డా..? లేక వ్యాక్సిన్ల భారం త‌గ్గించుకునేందుకా..? అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

'ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల ప‌రిపాల‌న‌..?

'తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.' అని వైఎస్ షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. మ‌రీ చూడాలి.. ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం సారు స్పందిస్తారో లేదో మ‌రీ.

Next Story