ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి

By సుభాష్  Published on  13 Dec 2019 10:01 AM GMT
ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి

బంగ్లాదేశ్‌ లో భారీ పేలుడు సంభవించింది. అక్రమ నిర్వహణలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేడుడు సంభవించి 13 మంది మృతి చెందగా, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఢాకా శివారు కెరాణీ గంజ్‌లోని ప్లాస్టిక్‌ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పని చేస్తోన్న 13 మంది మరణించారు.. నజ్రుల్‌ ఇస్లాం అనే వ్యక్తికి చెందిన ఈ కంపెనీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ ప్లేట్లూ, కప్పులను తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది కార్మికులు షిప్టుల వారిగా పని చేస్తారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించించడంతో కార్మికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ పేడులు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఫ్యాక్టరీలో భారీ మొత్తంలో మంటలు వ్యాపించాయి. ఆ మంటల దాటికి బయటకు వెళ్లలేక మంటల్లోచిక్కుకుని మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చేపట్టి, విచారణ చేపడుతున్నారు.

Next Story