నిర్భయ దోషులపై రాష్ట్రపతి సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  17 Jan 2020 8:27 AM GMT
నిర్భయ దోషులపై రాష్ట్రపతి సంచలన నిర్ణయం

2012, డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ పటియాల కోర్టు ఈనెల 22న ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష పటిషన్‌ను పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నలుగురు దోషులు అక్షయ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త, ముఖేష్‌ సింగ్‌లకు డెత్‌వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. కాగా, వీరు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మలు దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇక చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ముఖేష్‌సింగ్‌ రాష్ట్రపతికి మూడు రోజుల కిందటనే పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో ప్రొటోకాల్‌ ప్రకారం.. ముందుగా దోషి క్షమాభిక్ష దరఖాస్తు ఢిల్లీ సర్కార్‌కు చేరగా, ఆ క్షమాభిక్షను తిరస్కరించాలని ఆప్‌ ప్రభుత్వం లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు విన్నవించింది. ఆ తర్వాత పిటిషన్‌ కేంద్ర హోంశాఖకు పంపించింది. దీంతో కేంద్రం హోంశాఖ ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తరస్కరించాలని కోరుతూ.. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకునస్నారు.

దేశ వ్యాప్తంగా ఢిల్లీలో సంచలన సృష్టించిన నిర్భయ కేసు ఏడేళ్లు అవుతోంది.నేటితో ఏడేళ్లు అయింది. 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు. ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాలపాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. ఇక చివరిగా ఢిల్లీ పటియాల కోర్టు నలుగురిని క్షమించేది లేదంటే మరణ శిక్షను అమలు చేసింది. వీరిని ఉరితీసేందుకు ఇప్పటికే అధికారులు తీహార్‌ జైల్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఒకేసారి నలుగురికి ఉరి వేసేందుకు నాలుగు ఉరి కంబాలను సైతం ఏర్పాటు చేశారు.

కాగా, వీరికి ఉరిశిక్ష ఖరారు చేసి దాదాపు రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ఉరి తీయలేదు. ఈ ఘటనపై అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులకు వెంటనే ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకే ఎన్నో విచారణలో, ఎన్నో పిటిషన్లను విచారించింది సుప్రీం కోర్టు. వీరిని ఉరితీసేందుకు ఉరితాళ్లను కూడా బీహార్‌లోని బక్సర్‌ సెంట్రల్‌ జైలు ఖైదీలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story