పేటీఎమ్ ఉద్యోగికి కరోనా..
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 March 2020 4:00 PM GMTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు భారత్లో కూడా ప్రవేశించింది. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఉన్న ఏ ఒక్కరూ ఈ వైరస్ బారిన పడకపోగా.. విదేశాలనుండి వచ్చిన వారితో మాత్రం మనకూ అపాయం పొంచివుందనేది సత్యం. ఇప్పటివరకూ పాజిటివ్గా నమోదయిన కేసులు కూడా అలాంటివే..
ఇక పేటీఎమ్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. పేటీఎమ్ కు చెందిన ఓ ఉద్యోగి ఈ మధ్య ఇటలీకి వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయితే.. అతనికి ఈ రోజు కరోనా టెస్ట్ చేయగా రిపోర్ట్ పాజిటీవ్ గా వచ్చింది. సదరు ఉద్యోగి గుర్ గావ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి యొక్క టీం మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపారు పేటీఎమ్ అధికారులు. ఇప్పటి వరకు దేశంలో 28కరోనా కేసులు నమోదయ్యాయి.