అస‌లు విష‌యం గ్ర‌హించిన ఓంకార్.. ఇంత‌కీ ఏంట‌ది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 7:25 AM GMT
అస‌లు విష‌యం గ్ర‌హించిన ఓంకార్.. ఇంత‌కీ ఏంట‌ది..?

యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించి.. అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయి.. ఆత‌ర్వాత డైరెక్ట‌ర్‌గా కూడా స‌క్స‌స్ అయ్యాడు ఓంకార్. హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యం సాధించారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో రాజు గారి గ‌ది 2 చిత్రాన్ని నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన తారాగ‌ణంగా ఓంకార్ తెర‌కెక్కించారు. అయితే... ఆ సినిమా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఓంకార్ తాజాగా తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది 3. ఇందులో అశ్విన్ బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఓంకార్ ఇక రాజు గారి గ‌ది సీక్వెల్స్ తీయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ట‌. స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డం ఓ కార‌ణ‌మైతే... ఈ సీక్వెల్స్ తీయ‌డానికి స‌రిపోయే క‌థను ఓంకార్ రాసుకోలేక‌పోతున్నారు.

అందుక‌నే ఇక రాజు గారి గ‌ది సీక్వెల్స్ తీయ‌కూడ‌దు. తీసి ఉన్న పేరు పొగొట్టుకోకూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే కనుక నిజ‌మైతే.. తెలివైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే. మ‌రి.. త‌దుప‌రి చిత్రానికి ఏ త‌ర‌హా క‌థాంశాన్ని ఎంచుకుంటాడో చూడాలి.

Next Story