18 ఎమ్మెల్యేలకు నోటీసులు

By సుభాష్  Published on  15 July 2020 6:51 AM GMT
18 ఎమ్మెల్యేలకు నోటీసులు

రాజస్థాన్‌లో రాజకీయం వేడెక్కుతోంది. సచిన్‌ పైలట్‌, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని ,లేని పక్షంలో పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన సచిన్‌ పైలట్‌, తన వెంట ఉన్న 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, గెహ్లాట్‌ ప్రభుత్వం మైనార్టీలో లో పిపోయిందని, ఇక సోమవారం సీఎం నివాసంలో, మంగళవారం హోటల్‌లో నిర్వహించిన రెండు సీఎల్పీ సమావేశాలకు సచిన్‌తో పాటు ఆయన వెంట ఉన్నమంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కాగా, సచిన్ పైలట్‌ను పార్టీ నుంచి తొలగించాలని మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.

సచిన్‌ పైలట్‌పై క్రమ శిక్షణ చర్యలు

మరోవైపు కాంగ్రెస్‌పార్టీ సచిన్‌ పైలట్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎంపదవుల నుంచి ఆయనను తొలగించింది. అలాగే సచిన్‌ వెంట ఉన్నమంత్రులు విశ్వేందర్‌సింగ్‌, రమేష్‌ మీన్‌లను కేబినెట్‌ నుంచి తప్పించింది. ఇక తాజాగా సచిన్‌ సహా 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ నోటీసులు జారీ చేసింది.

Next Story