ప్రముఖ రెస్టారెంట్లో వెయిటర్లు లేరు!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 6:04 AM GMT
ప్రముఖ రెస్టారెంట్లో వెయిటర్లు లేరు!

అయితే ఇంతకుముందు రోబో హోటల్ అంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం మన దేశంలో ప్రముఖ పట్టణాలలో రోబో సర్వీసులు మొదలయ్యాయి. తాజాగా ఒడిస్సా లోని తొలి రోబో హోటల్ రెడీ అయింది. భువనేశ్వర్ లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్ల బదులు రెండు ఇండియన్ రోబోలు దర్శనం ఇవ్వనున్నాయి. అయితే చక్కగా స్వాగతిస్తూ కస్టమర్లకు కావలసినవన్నీ అందిస్తున్న ఈ రోబోలకు చంప, చమేలి అని పేర్లు పెట్టారు. రోబోలతో వినూత్నంగా ఉండటంతో ఈ రెస్టారెంట్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మూడు గంటలపాటు ఛార్జింగ్ పెడితే చాలు ఈ రోబోలు 24 గంటల పాటు పని చేస్తాయి. ప్రస్తుతం ఈ రోబోలు వెయిటర్లుగా ఉన్న రెస్టారెంట్‌లు చెన్నై, కోయంబత్తూర్‌, శివమొగ్గలోనూ ఉన్నాయి. ఇప్పుడు భువనేశ్వర్లో ఈ హోటల్ ప్రారంభం అయ్యింది. రెస్టారెంట్ కి వెళ్ళగానే ఎదురు వచ్చి, గుడ్ మార్నింగ్‌.. గుడ్ ఈవెనింగ్ చెప్పేసి, ఆర్డర్ తీసుకు వచ్చే ఈ రోబోలను చూడటానికి జనం ఉత్సాహంగా తరలివెళ్తున్నారు. అందులోను ఈ రోబోలు అన్ని భాషల్లోను మాట్లాడుతూ ఉండటం ప్రత్యేక ఆకర్షణ.. . హోటల్లో తినడానికంటే కూడా ఈ రోబోను చూడటానికి ఎక్కువ మంది జనం వస్తారు అనడంలో ఆశ్చర్యం లేదు.

Next Story