బ్రేకింగ్: భార‌త్‌లో 9వ క‌రోనా మ‌ర‌ణం

By సుభాష్
Published on : 23 March 2020 4:51 PM IST

బ్రేకింగ్: భార‌త్‌లో 9వ క‌రోనా మ‌ర‌ణం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు అధికమవుతున్నాయి. తాగాజా భారత్‌కు పాకిన ఈ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే కరోనా మరణాలు 8కి చేరగా, తాజాగా సోమవారం మరో కరోనా మరణం సంభవించింది. ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 400పైగా దాటిపోయింది. కోల్‌కతాకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 13వేలకుపైగా చేరాయి. 3 లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో పాజిటివ్‌ కేసులు 33కు చేరుకున్నాయి. ఈ ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Next Story