ముంబై ఉగ్రదాడిపై స్పందించిన రతన్‌ టాటా.. ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగం

Ratan tata twitt mumbai terror attack.. 2008, నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే.

By సుభాష్  Published on  26 Nov 2020 9:58 AM GMT
ముంబై ఉగ్రదాడిపై స్పందించిన రతన్‌ టాటా.. ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగం

2008, నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మరణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌టాటా ఆ దుర్ఘటనపై ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తాజ్‌మహల్‌ప్యాలెస్‌హోటల్‌ ఫోటోను పోస్టు చేసి ఆ విధ్వంసాన్ని మర్చిపోలేమని అన్నారు. వందేళ్ల కిందట నాటి తాజ్‌మహల్‌ హోటల్‌పై 12 ఏళ్ల కిందట ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ హోట్‌ ఓనర్‌ టాటా గ్రూపే. అయితే ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముంబై ప్రజలు చూపిన తెగువను, సాహసాన్ని రతన్‌ టాటా ప్రశంసించారు.

ముంబై ప్రజలు ఆ రోజు ప్రదర్శించిన సున్నితత్వం భవిష్యత్తులోనూ ప్రజ్వరిల్లుతుందని చెప్పుకొచ్చారు. ఉగ్రదాడి జరిగి కొన్ని నెలల తర్వాత ఆ హోటల్‌ను మరమ్మతులు చేశారు. ఆ రోజు జరిగిన దాడిలో ఆ హోటల్‌లోనే 31 మంది మరణించారు. అయితే ముంబైలో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక తన ట్వీట్‌లో.. 26/11 మారణ హోమం జరిగి 12 ఏళ్ల గడిచాయి. అయినా ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. ఎప్పటికీ మర్చిపోలేం అని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న ఐక్యత, దయను మెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం..అంటూ ట్వీట్‌ చేశారు.

Next Story