తాజ్‌ మహల్‌కు మెట్రో రైలు.. నేడు మోదీ శంకుస్థాపన

PM Modi to virtually inaugurate construction of Agra Metro project .. తాజ్‌ మహల్‌కు మెట్రో రైలు.. నేడు మోదీ శంకుస్థాపన

By సుభాష్  Published on  7 Dec 2020 4:33 AM GMT
తాజ్‌ మహల్‌కు మెట్రో రైలు.. నేడు మోదీ శంకుస్థాపన

ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ అందాలను త్వరలో మెట్రో రైలు ప్రయాణికులు వీక్షించవచ్చు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం (ఈరోజు) ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ మెట్రో రైలు నిర్మాణ పనులు డిసెంబర్‌ 7న ప్రారంభమవుతాయి. రెండు కారిడార్లలో చేపడుతున్న ఈ మెట్రో ప్రాజెక్టు వల్ల ఆగ్రా ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. నగర అందాలను సైతం వీక్షించే పర్యాటనలకు ప్రయోజనం కలుగనుంది అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

రూ. 8379.౬౨ కోట్లతో యూపీ సర్కార్‌ ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు చేయనుంది. రెండు కారిడార్లలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 294 కిలోమీటర్లు. మెట్రో రైలు మార్గాన్ని ఆగ్రాలోని ప్రధాన ప్రాంతాలతో పాటు తాజ్‌మహల్‌, ఆగ్రా కోట, సికంద్ర పర్యాటక కేంద్రాలతో రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్లను అనుసంధానిస్తూ నిర్మించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాల్గొననున్నారు.

Next Story