హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్‌ పేల్చివేత

Naxalites pasted threatening posters after blowing up railway tracks.హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్‌ను నక్సలైట్లు గురువారం

By M.S.R
Published on : 27 Jan 2022 2:10 PM IST

హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్‌ పేల్చివేత

హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్‌ను నక్సలైట్లు గురువారం పేల్చివేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడిహ్ జిల్లా చిచాకీ- చౌదర్యాబంధ్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు ట్రాక్ ను నక్సలైట్లు పేల్చివేశారు. హౌరా- న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి పేల్చివేసిన రైల్వే లైన్ వద్దకు వచ్చారు. రైల్వే కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది హుటాహుటిన వచ్చి రైల్వే లైను పునరుద్ధరణ పనులు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నక్సలైట్లు బాంబు పెట్టి రైల్వే ట్రాక్‌ను పేల్చివేశారనే సమాచారం అందిన వెంటనే హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను మళ్లించి వేరే మార్గంలో నడుపుతున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే CPRO రాజేష్ కుమార్ దీని గురించి సమాచారం ఇచ్చారు. ధన్‌బాద్ డివిజన్‌లోని కరమాబాద్-చిచాకీ స్టేషన్ మధ్య ఉదయం 00.34 గంటలకు పేలుడు సంభవించిందని పెట్రోల్‌మెన్ గౌరవ్ రాజ్, రోహిత్ కుమార్ సింగ్ చిచాకి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా, హౌరా-ఢిల్లీ రైలు మార్గంలోని గోమో-గయా (జిసి) విభాగంలో రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి.

Next Story