రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా.. ఆ రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్న మహమ్మారి

Many people infected with corona even after both doses of vaccine in Kerala.దేశంలోని చాలా రాష్ట్రాలలో కరోనా

By M.S.R  Published on  16 Nov 2021 12:04 PM GMT
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా.. ఆ రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్న మహమ్మారి

దేశంలోని చాలా రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం పైగా కేరళ లోనే నమోదవుతూ ఉన్నాయి. ఇది మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మునుపటి కంటే చాలా తక్కువ కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అనేక ప్రదేశాలలో కరోనావైరస్ సంక్రమణ బాగా తగ్గింది. అయితే బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ అనేది భయపెడుతూ ఉంది. రెండు డోస్‌లు వేసుకున్న రోగులకు కూడా కరోనా సోకిన సందర్భాలు చాలానే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ప్రమాదం దృష్ట్యా, త్వరలో బూస్టర్ మోతాదులు కూడా మనకు అవసరం కావచ్చు. కేరళలో ఇప్పుడు రెండు డోస్ లు వేసుకున్న వారికి కూడా కరోనా సంక్రమణ మొదలైంది.

రెండు డోస్‌ వేసుకున్న తర్వాత కూడా.. కేరళలో లాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరిగితే మరోసారి చాలా ఇబ్బందులు తప్పకపోవచ్చు. కేరళ మినహా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గాయి, అయితే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ఆందోళనను పెంచుతున్నాయి. కొత్త కేసుల్లో కేరళ ఇప్పటికీ టాప్ లోనే ఉంది. ప్రజలు ఇప్పటికీ వైరస్‌కు గురవుతున్నారు, రెండు టీకాలు వేసుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్‌లు గుర్తించబడ్డాయి. గత వారం గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతిరోజూ 6,000 కంటే ఎక్కువ కొత్త కేసులు కనిపిస్తున్నాయి, ఇది దేశవ్యాప్తంగా కొత్త కేసులలో 60 శాతం. అంతేకాదు, కేరళలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 40 శాతం మంది రెండు డోస్‌లు తీసుకున్నవారే. కేరళ జనాభాలో 95 శాతం మందికి కోవిడ్ యొక్క మొదటి డోస్ ల టీకాలు తీసుకున్నారని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

Next Story