హిందూ -ముస్లిం వివాహాలపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

Allahabad High court judgment on Hindu - Muslim Marriages.. హిందూ-ముస్లిం వివాహాలపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు హిందు-ముస్లిం వివ

By సుభాష్  Published on  24 Nov 2020 10:32 AM GMT
హిందూ -ముస్లిం వివాహాలపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

హిందూ-ముస్లిం వివాహాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతాంతర వివాహాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం గమనార్హం. కోర్టు దృష్టిలో వారు హిందు-ముస్లిం కాదని, వారిద్దరూ 18 సంవత్సరాలు దాటిన వారు కాబట్టి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుదని స్పష్టం చేసింది.

ఇద్దరు కలిసి సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారం తెలిపింది. వారు ఆడ-మగ, మగ-ఆడ కావచ్చు. అలాంటి వారి జీవితంలోకి వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఆ రకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం కూడా మతాంతర వివాహాల విషయంలో జోక్యం చేసుకోలేదని కోర్టు తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ, అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు మతం మారిన ప్రియాంక తన పేరును సైతం అలియాగా మార్చుకున్నారు. అయితే వివాహంపై ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ అయిన తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి జరిపించారంటూ సలామత్‌, మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టారు. దీంతో సలామత్‌, ప్రియాంక దంపతులు కోర్టును ఆశ్రయిచారు. కేసు కొట్టివేసి తముక రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌లను విచారించిన కోర్టు.. ప్రియాంక వయసు విషయంలో ఎలాంటి వివాదం లేదని, ఆమెకు 21 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆమె భర్తతో కలిసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పోక్సో చట్టం వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది. సలామత్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. అయితే వివాహాల్లో హిందువా, ముస్లిమా అనేది న్యాయస్థానం చూడదని, కేవలం వారు మేజర్లా కాదా అనేది ముఖ్యమని తెలిపింది. మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని ఏ వ్యక్తి గానీ, కుటుంబం గానీ, రాష్ట్రం గానీ వ్యతిరేకించకూడదని స్పష్టం చేసింది. హిందూ యువతిని వివాహమాడిన ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసుపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది.

తండ్రి తన కుమార్తెను కలిసే హక్కు ఉంటుంది

అదే సమయంలో యువతి తండ్రి తన కుమార్తెను కలిసే హక్కు కూడా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రియాంక ఖర్వార్‌ లేకపోతే అలియా ఎవరైనా కావచ్చు ఆమె తనకు నచ్చిన వారిని కలిసే స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. మరోవైపు ప్రియాంక తన కుటుంబ సభ్యుల మీద కూడా గౌరవం కలిగి ఉంటుందని, అయితే వివాహం చేసుకోవడానికి మతం మరడాన్ని ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఇది చెల్లదని వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అది వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. కోర్టు దృష్టిలో ప్రియాంక, సలామత్‌ అన్సారీ అనేవారు హిందు-ముస్లింలు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఒక వ్యక్తి తమకు నచ్చిన వ్యక్తితో స్వేచ్ఛగా నివసించే హక్కును కలిగి ఉంటారని తీర్పు వెలువరించింది. మతాంతర వివాహాలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఏకంగా లవ్‌ జిహద్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని యోచనలో ఉన్నాయి. లవ్‌ జిహాద్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.

Next Story