హైదరాబాద్ నల్లకుంట పీఎస్ పరిధిలో దారుణం
By Newsmeter.Network Published on 7 Dec 2019 2:07 PM IST
హైదరాబాద్ లోని నల్లకుంట పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముడిని అన్నా, వదినలు కలిసి హతమార్చడం తీవ్రకలకలం రేపింది. ఆస్తి తగాదాల విషయంలో తమ్ముడు రమేష్ (40)ను అన్న, వదినలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. హత్య అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ నల్లకుంట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలేనా..? లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, పోర్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story