భార్యపై భర్త హత్యాయత్నం

By సుభాష్
Published on : 17 April 2020 5:38 PM IST

భార్యపై భర్త హత్యాయత్నం

విశాఖలోని మర్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భార్యపై భర్త హత్యాయత్నం పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య కోమటి దేవిపై భర్త రమేష్‌ పిడి గుద్దులతో దాడికి పాల్పడ్డాడు. భర్త మాజీ సైనిక ఉద్యోగి. భార్యపై దాడికి పాల్పడటంతో స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దేవి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.

బాధితురాలి కుటుంబ సభ్యులు మర్కాపురం పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Next Story