రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'తెలంగాణ మున్సిపల్ ఎన్నికల'పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యయాయి. ఈ మేరకు.. ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అలాగే.. ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.