కనుల విందుగా ఎంపీ మాధవి వివాహ వేడుక
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Oct 2019 12:10 PM ISTవిశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ అరకు ఎంపీ మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం కనుల విందుగా జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ వివాహనికి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు హాజరయ్యారు. వివాహ వేదిక లైటింగ్, పూల అలంకరణలతో ముచ్చట గొలిపింది. ఒక్క మాటలొ చెప్పాలంటే..అరకు లోయ మొత్తం మాధవి పెళ్లి ముచ్చట్లతోనే తెల్లారింది. సంప్రదాయబద్దంగా ఎంపీ మాధవి వివాహం జరిగింది.
�
ముహూర్తానికి గంట ముందే పెళ్లికుమారుడు వివాహ వేదిక మీదకు చేరుకున్నాడు. అది అక్కడ సంప్రదాయం. పెళ్లి బాజాలు మోగిన తరువాత పెళ్లి కుమార్తె మాధవి వివాహ వేదిక మీదకు వచ్చారు. పెళ్లి సందర్భంగా అరుకులోయలో సందడి వాతావరణం నెలకొంది.
�
Next Story