కర్ణాటకలో విజృంభిస్తున్న 'మంకీ ఫీవర్'

By అంజి  Published on  2 March 2020 3:22 AM GMT
కర్ణాటకలో విజృంభిస్తున్న మంకీ ఫీవర్

ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్ -19 తో వైరస్ వల్ల భయపడుతుంటే దక్షిణ భారతదేశంలో మరో వైరస్ విజృభిస్తోంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్ ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెల రోజుల క్రితం శివమొగ్గకు చెందిన ఓ 58ఏళ్ల మహిళ ఈ వ్యాధికి బలైంది. ఈ ఘటన మరిచేలోపే ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దపూర తాలూకాకు చెందిన 64 ఏళ్ల భాస్కర్ గణపతి హెగ్దే ఈ మంకీ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోయాడు.

Monkey fever karnataka

ఈ ఫీవర్‌ను ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గ జిల్లాల్లో తొలిసారిగా గుర్తించారు. అనంతరం ఇది ఉత్తర కన్నడ జిల్లాకు విస్తరించింది. ఒక్క శివమొగ్గలోనే 55మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో 22మందికి వ్యాక్సీన్లు వేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ సూచనలిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యకాలంలో తరచూ కనిపిస్తుంటుందని, ఈ సారి దీని లక్షణాలు కాస్త ముందే వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

Monkey fever karnataka

తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముక్కు, నోట్లోంచి రక్తం కారడం, వాంతులు, కండరాలు పట్టేయడం,ఒళ్లు నొప్పులు, వణకడం, మానసిక వ్యాకులత వంటి లక్షణాలు ఈ వ్యాధి గలవారిలో కనిపిస్తాయి. చికిత్స తీసుకుంటే రెండువారాల్లో తగ్గిపోతాయి. కానీ ఒళ్లునొప్పులు కొన్ని నెలలపాటు వెంటాడుతాయి.

Next Story