మోదీని కలవనున్న మమత..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 11:50 AM GMT
మోదీని కలవనున్న మమత..!

కోల్‌కతా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించే మమత ఆయనతో భేటీ కాబోతున్నారు. బుధవారం ఢిల్లీలో మోదీతో మమత భేటీ అవుతున్నారు. ఈ విషయాన్ని మమత కూడా ధృవీకరించారు. అయితే...రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులపైనే కలుస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. కాని..ప్రతిపక్షాలు మాత్రం శారద కుంభకోణం నుంచి బయటపడటానికే కలుస్తున్నారని విమర్శిస్తున్నారు.

Next Story