17లక్షల కౌలు రైతుల్లో 905 మందే అర్హులా...?!- సీఎం జగన్‌కు లోకేష్ ప్రశ్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 10:22 AM GMT
17లక్షల కౌలు రైతుల్లో 905 మందే అర్హులా...?!- సీఎం జగన్‌కు లోకేష్ ప్రశ్న

ముఖ్యాంశాలు

  • ట్వీటర్ లో సీఎం జగన్ ను ప్రశ్నించిన లోకేష్
  • లక్షల మంది రైతుల్లో వందలమందే అర్హులా..?!
  • రైతులకు కూడా కులం రంగు వేస్తున్నారా అని ప్రశ్నించిన లోకేష్

అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 'కౌలు' భరోసా దారుణమంటూ తన ట్విట్‌కు ఓ పేపర్ క్లిప్‌ను కూడా యాడ్ చేశారు. 17లక్షల కౌలు రైతులు ఉంటే 'రైతు భరోసా' ఇవ్వడానికి 905 మంది రైతులే కనిపించారా అంటూ ట్విట్ చేశారు. ప్రతి దానికి మీ పార్టీ రంగు వేసినట్లు, రైతులకూ కులం రంగు పులిమారా అంటూ వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.



Next Story