కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో పోలీసులు - అడ్వకేట్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లాయర్లు మహిళా అని కూడా చూడకుండా పోలీసు అధికారిపై దాడి చేశారు. గొడవ జరిగిన సమయంలో ఘటనా స్థలంలొ డీసీపీ మౌనిక భరద్వాజ్ విధులు నిర్వహిస్తున్నారు. గొడవలో లాయర్లు ఆమెపై దాడిచేశారు. కొంత దూరం లాక్కుంటూ వెళ్లారు. ఈ సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.