భారత్‌లో కరోనా విలయం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 6:05 AM GMT
భారత్‌లో కరోనా విలయం..

భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,894 కరోనా కేసులు నిర్థారణ అయినట్లు కేంద్ర, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 51,18,253కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 40,25,080 మంది కోలుకోగా.. 10,09,976 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 83,198కి పెరిగింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.64శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 11,36,613 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 6,05,65,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 68లక్షల పైగా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే.. మరి కొద్ది రోజుల్లో భారత్‌ మొదటి స్థానానికి చేరుకుంటుందని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Next Story