భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
By తోట వంశీ కుమార్ Published on 22 Sep 2020 5:37 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 75,083 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,053 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 55,62,664కు చేరింది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 44,97,868కి చేరింది. ప్రస్తుతం 9,75,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 88,935కి చేరింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 80శాతం ఉండగా.. మరణాల రేటు 1.6శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 9,33,185 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 6,53,25,779కు కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 70లక్షల కేసులతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది.