భారత్లో 24గంటల్లో 47,703కేసులు.. 654 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 28 July 2020 5:31 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 654 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 9,52,744 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,96,988 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారీన పడి ఇప్పటి వరకు 33,425 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న ఒక్క రోజే 5,28,000 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్(భారతీయ వైద్య పరిశోధన మండలి) తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1.73కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర,తమిళనాడు నుంచే నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్,కర్ణాటక నుంచి నమోదవుతున్నాయి.ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.